బిగ్ బాస్ Telugu Season 5: ఆయన కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకో. సిరిపై మాధవీలత షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ Telugu Season 5: ఈ సీజన్లో ముఖ్యంగా సిరి, షణ్ణూ మీద కెమేరా ఎక్కువగా ఫోకస్ అవుతోంది.
బిగ్ బాస్ Telugu Season : బయట ఇద్దరికీ లవర్స్ ఉన్నారు. వాళ్లతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినా ఎవరి ఇమేజ్ను వాళ్లు కాపాడుకుంటూ హాయిగా ఉన్నారు. బిగ్బాస్ హౌస్లోకి వచ్చాక ఏమవుతుందో ఏమో. ఎందుకు అలా మారిపోతారో ఎవరికీ అర్థం కాదు. ప్రేమలు, పగలు, ద్వేషాలు. అన్ని రోజులు హౌస్లో కలిసి ఉంటే అవన్నీ సహజమేనేమో కానీ అవే హైలెట్ చేస్తుంటాడు బిగ్బాస్. ప్రేక్షకులకు కావలసినంఎం టర్టైన్మెంట్ అందించాలంటే తప్పదేమో మరి. ఈ సీజన్లో ముఖ్యంగా సిరి, షణ్ణూ మీద కెమేరా ఎక్కువగా ఫోకస్ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మాధవీలత అయితే. విమర్శించడానికి ఓ టాపిక్ దొరికిందని ఇద్దర్నీ ఏకిపారేసింది.
సిరిది సిగ్గులేని జన్మ. అంత తిట్టినా వాడితో స్నేహం చేస్తోంది. అలా చేస్తే భార్య కూడా భర్తకి వాతలు పెడుతుంది. ఓట్ల కోసం. వచ్చే నోట్ల కోసం ఇంతగా దిగజారుతారా. అటు తల్లిని, ఇటు పార్ట్నర్ (శ్రీహాన్)ను లెక్కచేయని పద్ధతి గల మంచి అమ్మాయి సిరి. బంధాలు, అనుబంధాలకి అర్థం మార్చిన ఘనత మీది. షో అయిపోయి బయటకు వచ్చాక శ్రీహాన్ నిన్ను భరిస్తాడంటే ఆయన దేవుడితో సమానం.
అతడి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకో. వచ్చే జన్మలో అయినా దేవుడు నీకు మంచి బుద్ధి ఇస్తాడు. షణ్ముఖ్ గురించి రాస్త. పక్కవాళ్లకు నీతులు చెప్పడం కాదు. సిరిని సెక్యూరిటీ గార్డ్లా కాపాడుతున్నాడట. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో షణ్ణూ, సిరి ప్రవర్తన చూసే వారికి ఏవగింపుగా ఉంది. వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటున్నారని షో చూస్తున్న ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అని మాధవీలత ఘాటుగా విమర్శించింది.
అఖండ Collections : నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా జోరు మాములుగా లేదు... విడుదలైన ఫస్ట్ షో నుంచే సినిమాకి హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. రొటీన్ కథే అయినప్పటికీ బాలయ్యను బోయపాటి చూపించిన విధానం, తమన్ మ్యూజిక్ మాస్ ప్రేక్షకులకి బీభత్సంగా నచ్చేసింది.
దీనితో వసూళ్ళలో అఖండ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. కేవలం పదిరోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల మార్క్ని అందుకోవడం గమనార్హం. ఈ చిత్రం పది రోజుల్లో. నైజాంలో రూ. 16.50 కోట్లు, సీడెడ్లో రూ. 12.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.10 కోట్లు, గుంటూరులో రూ. 3.96 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.39 కోట్లు, కృష్ణాలో రూ. 2.99 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.80 కోట్లు, నెల్లూరులో రూ. 2.15 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది.
ఇక తెలుగులో రాష్ట్రాల్లో అయితే 49.34 కోట్లు షేర్ రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కలిపితే మొత్తంగా రూ. 9.35 కోట్లు రాబట్టింది. వీటన్నింటిని కలుపుకుంటే రూ. 58.74 కోట్లు షేర్ రాగా, రూ. 100 కోట్లు గ్రాస్ను దాటినట్లు చెబుతున్నారు. కాగా ఈ సినిమా రూ.53 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకొని బరిలోకి దిగి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది.
సినిమా విషయంలో ఎక్కడ కూడా రాజీపడలేదని దర్శకుడు రాజమౌళి తెలిపారు. సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ గురించి చాలా రీసెర్చ్ చేశార. ఈ బైక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బైక్ పేరు వెలోసెట్ రెట్రో బైక్. ఆ బైక్ 1934 కు చెందిన ఎమ్ సిరీస్ బైక్లా కనిపిస్తోంది. ఇది బ్రిటన్కి చెందింది. వెలోసెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ బర్మింగ్హామ్లో ఉంది.
1920 నుంచి 1950 వరకు...వెలోసెట్ అంతర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో ప్రధాన పోటీదారుగా నిలిచింది. శక్తివంతమైన 350 సిసి, 500 సిసి బైక్లను తయారు చేసింది. అయితే రానురాను ఇతర ఆటోమొబైల్ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీరావడంతో వెలోసెట్ బైక్ల తమ ఉత్పత్తులను నిలిపివేసింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ బైక్స్ అత్యంత ప్రాచుర్యం పొందినట్టుగా తెలుస్తోంది.
1971లో పిభ్రవరి తర్వాత అధికారికంగా బైక్ల ఉత్పత్తిని వెలోసెట్ నిలిపివేసింది. అయితే RRR సినిమా కోసం ఈ బైక్లో కొన్ని మార్పులు చేశారు. దాదాపుగా దీని కాస్ట్ తొమ్మిది లక్షలు ఉంటుందట. ఇలాంటి రెట్రో బైక్స్ ఎక్కువగా అక్షన్ వెబ్సైట్లోనే కనిపిస్తాయి.ఇక ఈ సినిమాలో ఆ బైక్ కోసం రాజమౌళి ఏకంగా పది లక్షలు ఖర్చు పెట్టాడని సమాచారం.
RRR Bike : దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్లు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దీనికి తోడు రిలీజైన ట్రైలర్కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పార్ట్ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో టీంమొత్తం ప్రమోషన్ లలో బిజీ అయిపొయింది.
You must be logged in to post a comment.